CM KCR | సంగారెడ్డి : సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే మీ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సంగారెడ్డి పట్టణం హైదరాబాద్లో అంతర్భాగం అయితా ఉన్నది. మెట్రో రావాల్సిన అవసరం ఉంటది. ఇస్నాపూర్ వరకు మొదటి దశలో, రెండో దశలో సంగారెడ్డి వరకు తీసుకురావాలని చింతా ప్రభాకర్ చెప్పారు. సంగారెడ్డికి మెట్రో వచ్చిదంటే మీ దశనే మారిపోతది. లాస్ట్ టైం బీఆర్ఎస్ క్యాండిడేట్ను ఓడగొట్టినా.. సంగారెడ్డి మీద నేను అలగలేదు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చిపెట్టాను. చింతా ప్రభాకర్ నా వెంబడి పడి ఇక్కడకు మెడికల్ కాలేజీ వచ్చేలా చేశారు. దాంతో పాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు వస్తున్నాయి. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటది అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక్కడ మంచిగా పని చేసే ఎమ్మెల్యే ఉంటే, హైదరాబాద్ సంకలోకి వచ్చింది సంగారెడ్డి కాబట్టి కాలుష్య రహితమైన పరిశ్రమలు, విద్యాసంస్థలు వచ్చే అవకాశం ఉంటది. ఇప్పటికే కొన్ని వచ్చాయి. ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండి ఇక్కడకు వచ్చిపోయేది ఉద్యోగులు. ఇప్పుడు సంగారెడ్డిలో ఉండి హైదరాబాద్కు పోయి వస్తున్నరు. ఆ మార్పు వచ్చింది. సంగారెడ్డి బాగా పెరిగింది కాబట్టి ఆ మార్పు వచ్చింది. నేను పాత మెదక్ జిల్లా మీ బిడ్డను. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని పెద్దలు చెప్పారు. జన్మభూమి మీద ఎవరికైనా సరే, ఎక్కడున్న ప్రేమ ఉంటది. అందుకే సంగారెడ్డితో నాకు అనుబంధం ఉంది. ఈసారి దయచేసి మళ్ల నేను అలిగేటట్టు చేయకండి ప్రభాకర్ను గెలిపించండి లాభం జరుగుతది అని కేసీఆర్ చెప్పారు.