CM KCR | హైదరాబాద్ : బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ. 100 కోట్లు కేటాయించి, ఆ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
బ్రాహ్మణుల మనసు, మాట, శరీరం చేసే పని లోకహితం కోసమే అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ చాలా మంది పేదలు ఉన్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను తెలంగాణ ప్రభుత్వం 2017, ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది. బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నాం. 780 మంది ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బ్రాహ్మిణ్ ఎంపవర్మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద గ్రాంట్గా రూ. 5 లక్షల గ్రాంట్ను ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 150 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని కేసీఆర్ తెలిపారు.