హైదరాబాద్ : ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుతోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎస్ సోమేశ్ కుమార్తో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర బడ్జెట్, బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర విషయాలపై సీఎం వీరితో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశముందని సమాచారం.