హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యాక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన ముఖ్యమంత్రి.. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరితహారం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ఈ సమావేశంలో చర్చిస్తారు.