CM KCR | దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ’ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు కే కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ, అధికారులకు సీఎం కేసీఆర్ వేడుకలపై దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఆగస్టు 08 – స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ఆగస్టు 09 – ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం.
ఆగస్టు 10 – వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
ఆగస్టు 11 – ఫ్రీడం రన్ నిర్వహణ
ఆగస్టు 12 – రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి.
ఆగస్టు 13 – విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు.
ఆగస్టు 14 – సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత అన్ని నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం.
ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఆగస్టు 16 – ఏక కాలంలో, ఎక్కడివారక్కడ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
ఆగస్టు 17 – రక్తదాన శిబిరాల నిర్వహణ.
ఆగస్టు 18 – ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ
ఆగస్టు 19 – దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణీ.
ఆగస్టు 20 – దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు.
ఆగస్టు 21 – అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
ఆగస్టు 22 – ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.