నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హాలియా మార్కెట్యార్డులో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు, అధికారులు హాజరయ్యారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల పురోగతిపై సీఎం చర్చిస్తున్నారు.
ముఖ్యంగా నెల్లికల్, ఇతర లిఫ్టు పథకాల నిర్మాణంపై సమీక్షతోపాటు గిరిజన భూముల సమస్య, సాగర్లో ఎన్ఎస్పీ క్వార్టర్ల కేటాయింపు అంశం, డిగ్రీ కాలేజీ భవనం, అంతర్గత రహదారులు, వ్యవసాయభూములకు వెళ్లే దారుల్లో కాల్వలపై బ్రిడ్జిల నిర్మాణం, వివిధ వర్గాలకు షాదీఖానాల ఏర్పాటు లాంటి అంశాలపై సమీక్ష చేయనున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఇంట్లో భోజనం చేసి, హైదరాబాద్కు తిరిగి వస్తారు.