టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ డీ గుకేశ్ టైటిల్ వేటకు మరింత చేరువయ్యాడు. టోర్నీలో ప్రస్తుతం 7.5 పాయింట్లతో ఇయాన్ నెపోనియాచి, హికారు నకామురతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న గుకేశ్..13వ రౌండ్లో పిరౌజా అలీరెజాతో తలపడనున్నాడు.
గత గేమ్లో తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేశ్..అలీరెజాను అధిగమిస్తే టైటిల్ ఖాతాలో వేసుకునేందుకు చాన్స్ లభించినట్లే. నెపోనియాచి, నకాముర మధ్య రసవత్తర పోరు సాగే అవకాశముంది.