BRS | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్) నూతన కార్యాలయాన్ని మే 4న అట్టహాసంగా ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారని, మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనవచ్చని తెలిపారు.
బీఆర్ఎస్గా మారిన అనంతరం పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.