BRS Party | ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రులు ఉన్నారు. నాందేడ్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ మంత్రులు, మహారాష్ట్రకు చెందిన ఆయా పార్టీల నేతలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో నాందేడ్ గురుద్వారాలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుంచి కేసీఆర్ సభాస్థలికి చేరుకోనున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారు.
అనంతరం బీఆర్ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.