ముంబై: సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసానికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలుస్తారు. సాయంత్రం 7.20 గంటలకు సీఎం కేసీఆర్ ముంబై నుంచి హైదరాబాద్కు రానున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.