CM KCR | హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జీహెచ్ఎంసీ మేయర్ ఉన్నారు.
ద్రౌపది ముర్ము విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొని, రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు రీవ్యూయింగ్ ఆఫీసర్గా హాజరవుతారు. పరేడ్ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు.