గతంలో కలెక్టరేట్ భవనాల్లో అరకొర వసతులు ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా ఉండేవి కావు. అధికారులతోపాటు కలెక్టరేట్లకు వచ్చే ప్రజలు ఎన్నో అవస్థలు పడటం చూశాను. ప్రస్తుత కలెక్టరేట్లు ఇంద్ర భవనంలా ఉన్నాయి.
విశాలమైన స్థలంలో చక్కటి భవన సముదాయాలు, విశాలమైన కార్యాలయ గదులను నిర్మించారు. ప్రభుత్వం ఇంత మంచి కలెక్టరేట్లను నిర్మించడం వలన ఉద్యోగులు ఆహ్లాదకర వాతావరణంలో బాగా పని చేస్తారన్న నమ్మకం ఉన్నది. ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించింది. ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూ.63 వేల కోట్లు ఉండేది. ప్రస్తుతం రూ.1.80 లక్షల కోట్లకు చేరింది. ఈ నిధులతో రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. త్వరలో కంటి వెలుగు రెండో విడత ప్రారంభించబోతున్నాం. అధికారులంతా కష్టపడి చిత్తశుద్ధితో పని చేసి మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేద్దాం.
– శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి