హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి, కృష్ణా నదుల్లో నదుల్లో నీటివాటాలు తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సంవత్సరాలుగా నీటి వాటాలు తేల్చకపోవడంపై ధ్వజమెత్తారు. సెక్షన్-3 కింద కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో దానికి అన్ని వాటాలు రావాలి. ఒక హైకోర్టు ఏర్పాటుకు మీరు తాత్సారం చేశారు. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన్రు, ఐదు సంవత్సరాలకు కాని చేయలేదు. అదేవిధంగా ఏడు సంవత్సరాలు అయ్పోయి ఎనిమిది సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో ఈ రోజుకు కూడా ఈ రోజుకు నీటివాటాలు తేలలేదు.
కృష్ణా నదిలో మా జలాలేంటి? గోదావరి నదిలో మా వాటా ఏంటీ? అది తెలంగాణ ప్రజల ధర్మమైన, న్యాయమైన హక్కు. మాకు సాగునీళ్లకైనా, తాగునీళ్లకైనా, పరిశ్రమలకైనా ఒక రాష్ట్రంగా మనుగడ సాధించాలి కాబట్టి మా రాష్ట్రం వాటా ఏందో తేల్చాలి. మరి గొప్ప కేంద్ర ప్రభుత్వం ఉంటే ఏడు సంవత్సరాలు పట్టకూడదు. ఏడు సంవత్సరాలు సమయం గడిచిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులుంటయ్. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎంత ఆరాటముంటది? కొత్త ప్రాజెక్టు కట్టుకోవాలే? నీళ్లుచ్చుకోవాలే.. కరువును తరిమేయాలనే గొప్ప ప్లానింగ్ ఉంటది. ఆ గొప్ప ప్లానింగ్కు మీరు చేస్తున్న ఆలస్యం, తాత్సారం ప్రతిబంధకంగా, ఇబ్బందికరంగా మారింది. కాబట్టి నేను ఈ ట్రిప్లో ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రమంత్రిని కలిసి డిమాండ్ చేస్త. అవసరమైతే పీఎంను కలిసి డిమాండ్ చేస్తం. మా డిమాండ్ అల్ల ఒక్కటే సెక్షన్-3 కింద గోదావరి, కృష్ణా జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, ఆ ట్రిబ్యునల్కు పంపించండి.
మీరు చెప్పిన ప్రకారం.. మేం ఆ రోజు సుప్రీంకోర్టులో ఈ రోజు విత్డ్రా చేసుకున్నం. ట్రిబ్యునల్ను పంపించండి. పంచి ఊరుకోకుండా టైంబౌండ్ డెసిషన్ ఇచ్చే విధంగా ట్రిబ్యునల్ను ఆదేశించండి. మూడు నెలలా.. నాలుగు నెలలా.. ఆ టైమ్లో ఏపీ, తెలంగాణ మధ్యనే కాబట్టి వాటాలు కూడా తేల్చేవిధంగా టైంబౌండ్గా రెండు రాష్ట్రాల మధ్య వాటాలు తేల్చేవిధంగా పంపియ్యమని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నం. ఒక వేళ పంపియ్యకపోతే.. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు లేవదీస్తాం.. అడుగడుగునా నిలదీస్తం. పార్లమెంట్లో కూడా మా శక్తిమేరకు ఇతర రాష్ట్రాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏడు సంవత్సరాలు దాటిపోయినయ్. మీరు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నరు. ప్రాజెక్టులు క్లియరెన్స్ చేయడం లేదు. ఎవరి వాటాలు తేలిపోతే కిరికిరి, పంచాయితీ పోతది.
మీ అడిగేది అసంబద్ధమైంది కాదు. అన్యాయమైంది కాదు. గొంతెమ్మ కోరిక కాదు. మే అడుగుతున్నది న్యాయమైన కొట్లాట. టైమ్ ఇంత గడిచినంక అడుగుతున్నమ్. ఇంత సమయం గడిచిన పోయిన తర్వాత ఎవరి ఓపికకైనా, సహనానికికైనా హద్దుంటది. ఆ సహనాన్ని పరీక్షిస్తే మంచిది కాదు. తెలంగాణ ఉద్యమాల గడ్డ ఇది. కాబట్టి నీటి వాటాల పంపకం కూడా వెంటనే తేల్చాలే కేంద్రం. ఇది కేంద్రం యొక్క ధర్మమైన, న్యాయబద్ధమైన బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో మీరు విఫలం చెందారు. ఆ మధ్య మీ కేసుంది సుప్రీం కోర్టులో అంటే.. విత్డ్రా చేసుకొమ్మంటే చేసుకున్నం. చాలా సమయం గడిచిపోతున్నది. ఇంకా వేచి ఉండలేం. దయచేసి దీనిపై వెంటనే తేల్చాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటానికి, ఆందోళనలకు రూపకల్పన చేయాల్సి వస్తది.. దిగిరాక తప్పదన్నారు.