హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్రం రైతులు, పేదలు, మధ్య తరగతి ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. చమురు ధరలే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందెవరి ? నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదా. కిషన్రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా? అప్పుడు క్రూడాయిల్ ధర ఎంత? ఇప్పుడు క్రూడాయిల్ ధర ఎంత? క్రూడాయిల్ ధర తగ్గినా కూడా అబద్ధాలు చెప్పి, దేశాన్ని మోసం చేసి డీజిల్ ధరలు పెంచతరు. పెంచిన తదుపరి రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ధర్నాలు చేస్తరు. ఏమైనా సిగ్గుందా? ఇజ్జత్ మానం ఏమైనా ఉందా? ఇంత అమాయకులా? గొర్రెలా ప్రజలు. మీరేమో పెంచాలే.. మేం తగ్గియ్యాలన్నా ? ఇది నీతా? దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం చేసే గొప్పతనమా ఇది.. ఇదేం దందా. డెఫినెట్గా వీరు ముంచెటోళ్లు తప్పా మంచి చేసెటోళ్లు కాదని తేలిపోయింది.
రైతుల వ్యతిరేక పార్టీ వంద శాతం. కిషన్రెడ్డి మాట్లాడుతడు రైతులతో మోడీ ఉన్నడు.. రైతులతో మోడీ ఉంటే బాయిల్డ్ రైస్ కొనమను. నువ్వంత గొప్పోడివి అయితే ఎట్లెట్ల కొనరు? కొనిపిస్తం కేంద్రంతోటి.. మాట్లాడిస్తం అని చెప్పు నేను పండిస్త 75లక్షల ఎకరాల్లో వరి. రెడీగా ఉన్నం మేం వేయడానికి. మీరు కొంటాంటే.. మేం వద్దంటున్నమానయ. ఎవర్ని మోసం చేస్తవ్ నువ్వు. రైతులు పండియాలే.. వారి కొంపలు ఆరిపోవాలే గందరగోళం చెలరేగాల్న ఇక్కడ. తెలంగాణలో రైతుల ఆత్మహత్య మళ్లీ పునరావృతం కావాల్నా. చాలా భరించరానటువంటి మాటలు కిషన్రెడ్డి ఇవాళ మాట్లాడిండు. అగ్రికల్చర్ పాలసీ గురించి నీకెరుక తోక. మాకెందుకు అగ్రికల్చర్ పాలసీ గురించి మాకు తెలియకపోతనే 1.40కోట్ల టన్నుల బియ్య ఇచ్చినమ నీకు గత సంవత్సరం.
తెలంగాణ వడ్లు పండిస్తది.. బాయిల్డ్ రైస్ వస్తయి అది కొంటవా? కొనవా? చెప్పుమంటే చెప్పడట.. ‘ముక్కెడున్నదిరా అంటే మూతి సుట్టు సూపించండట’ అన్నట్లుంది. రా రైస్ ఎంత తీసుకుంటడో అది చెప్పడు. వానాకాలం దానికే దిక్కులేదు ఇప్పుడు. వర్షాకాలం ఎంత తీసుకుంటవో చెప్పుమంటే చెప్పడట. ఓ దిక్కు పంట వస్తనే ఉన్నది.. కొంటనే ఉన్నం. ఇవాళ్టికి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 22లక్షల టన్నుల ధాన్యం కొన్నది. కానీ, మేం కళ్లాల కాడకు వెళ్లి డ్రామాలు పెడున్నరు.. దా ఇప్పుడు పెడుదువు అంటూ మండిపడ్డారు. స్పష్టంగా తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం.
ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరిని మీరు గమనిస్తా ఉన్నరు. రైతు చట్టాలు తెచ్చి వారి అరిగోస వెట్టి.. ఢిల్లీ బార్డర్ల మీద 750 మందిని చంపి.. తీరా ఇవాళ చట్టాలను వాపస్ తీసుకున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇది మోసకారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్రమంత్రి కావొచ్చు. ఇక్కడుంటే వాళ్ల పార్టీ అధ్యక్షుడు కావొచ్చు చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యుజ్ చేసేవిధంగా మాట్లడుతున్నరు. మీ వెళ్లినప్పుడేమో కేంద్రమంత్రి ఇంకోటి మాట్లాడుతడు. మంత్రులు, ఎంపీల డెలిగేషన్, అధికారుల బృందం, మంత్రుల బృందం కలిసి వెళ్లారు.
ఆ తర్వాత మంత్రి ఇచ్చిన డేట్ మేరకు మళ్లీ కలిస్తే ఢిల్లీలో తొమ్మిది పది మంది ఎంపీలుంటే అందరు కలిసి వెళ్లారు. మళ్లీ ఇంత మంది వచ్చిన్రా. మీకు మరేం పని లేదా? అంటడు ఆయన.. ఓ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రైతుల తరఫున వ్యవసాయశాఖ మంత్రి, ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు, మరో పది మంది ఎంపీలు పాలసీ వస్తే మా రైతులకు చెప్పుకోవాలి కదా? మంచో చెడో బతకాలి కదా? అని వెళ్తే మీకు పని లేదా అని అంటడ కేంద్రమంత్రి. పని లేకపోతర పది మంది ఎంపీలు, నలుగురు మంత్రులు, చీఫ్ సెక్రెటరీ, అగ్రికల్చర్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రెటరీ. పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. మీ వద్ద అంత పంట లేదు? శాటిలైట్ చూపెడుత లేదు. శాటిలైట్ చూపెడుత లేదా.. నీ మెదడు చూపెడుత లేదా?.. గంత అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నవ్.
మేం పైరవీ కారుల్లా కనిపిస్తున్నమా? రాష్ట్ర ప్రభుత్వం మేం.. ఏమనుకుంటున్నవ్.. మొత్తం లెక్కలు కొంటబోయి మొఖం మీద కొట్టినమ్. ఆ తర్వాత కరెక్టే 58లక్షల 66వేల ఎకరాల్లో ఉంది అని ఒప్పుకుంటడు.. ఏం మాట కరెక్ట్ నీది. రైతుల జీవితాలతో చెలగాటం ఆడే పద్ధతి ఇదేనా? ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతి ఇదేనా కేంద్ర ప్రభుత్వం. ఈ గోల్మాల్ చేసి రాజకీయాలు చేద్దామనుకుంటున్నరా? ఇలా ఛీప్గా చేసిన మాట్లాడుతున్నరు. ప్రజలను గందరగోళ పరిచి మాట్లాడుతున్నరు. డెఫినెట్గా వీళ్లు తెలంగాణ రైతులను ముంచుతరు వందశాతం. రేపు ధాన్యం పండిస్తరు. వీళ్లు తీసుకోరు.. ఏం గతి కావాలెనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.