హైదరాబాద్ : అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా సీఎం కేసీఆర్ చాదర్ సమర్పించారు. ప్రతి ఏడాది ప్రభుత్వం తరపున ఇచ్చే చాదర్ను కేసీఆర్ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్లో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, సీఎం కేసీఆర్ బాగుండాలని మత పెద్దలు ప్రార్థించారు. అనంతరం చాదర్ను వక్ఫ్ బోర్డు అధికారులకు సీఎం కేసీఆర్ అందజేశారు.
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ ను సీఎం శ్రీ కేసీఆర్ ఈ ఏడాది కూడా సమర్పించారు. ఈరోజు ముస్లిం మతపెద్దల సమక్షంలో దైవ ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్ ను ఆజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు సీఎం వక్ఫ్ బోర్డు అధికారులకు అందజేశారు. pic.twitter.com/e20PM2UXFH
— Telangana CMO (@TelanganaCMO) January 25, 2023