వికారాబాద్ : వికారాబాద్ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ, దేశ వ్యాప్తంగా అనంతగిరి కొండలకు ప్రత్యేక పేరుందన్నారు. అనంతగిరి కొండల్లో ఉన్న ఔషధాల గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. ఇక్కడి టీవీ దవాఖానా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు కేసీఆర్. వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా.. అనే నానుడి ఉందన్నారు. వికారాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో నేను ఎప్పుడు ఈ ప్రంతానికి వచ్చిన ప్రజలందరూ ఒక మాట అడిగేది. రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్లో పెట్టాలని కోరారు. తెలంగాణ వస్తే భగవంతుని దయ వల్ల వికారాబాద్నే జిల్లా చేసుకుందామని చెప్పాను. చేశాను. అద్భుతమైన పరిపాలన భవనం నిర్మించుకున్నాం. ఇవాళ ఈ భవనాన్ని ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉంది. శుభాకాంక్షంలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతానికి చరిత్ర ఉంది. తెలంగాణ, దేశ వ్యాప్తంగా అనంతగిరి కొండలకు పేరు ఉంది. గతంలో ఇక్కడ టీబీ దవాఖాన ఉండేది. వికారాబాద్కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మంజూరైంది. మీ ఊరికి పోయిన తర్వాత మీ పెదద్దలతో చర్చ పెట్టాలి. తెలంగాణ రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజీ వచ్చేదా? డిగ్రీ కాలేజీ వచ్చేదా? అనే విషయాలపై ఆలోచించాలి. తెలంగాణలో జరుగుతన్న కార్యక్రమాలు ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో జరుగుతున్నాయన్న విషయాలు మీ అందరికీ తెలుసు. గతంలో మన వ్యసాయం ఎట్ల ఉండేది. పెన్షన్ ఎంత వచ్చేది..? బియ్యం ఎన్ని కిలోలు ఇచ్చేది? కరెంట్ ఎన్ని గంటలు వస్తుండే?.. ఇవన్నీ గమనించాలి. పలు సందర్భాల్లో అనేక రకాల చర్చలు జరుగుతాయి. వాస్తవాన్ని యావత్ ప్రజలు చర్చించాలి. దాని ప్రకారమే మన నిర్ణయాలు ఉండాలి. 58 ఏండ్లు చాలా బాధలు పడ్డది తెలంగాణ. గతంలో ఉద్యమం సఫలం కాలేదు. ఫలితం రాలేదు. పిల్లలు చనిపోయారు కానీ ఉద్యమం గెలవలేదు. సమైక్యవాదులు గెలిచారు. తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు భూముల ధరలు డిమాండ్ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. వేరే రాష్ట్రాల్లో మూడు, నాలుగు ఎకరాలు కొంటున్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. సందర్భం, ఎలక్షన్లు వచ్చిప్పుడు రకరకాల వారు వస్తుంటారు. వాస్తవం మనం ఆలోచించాలి. యావత్ తెలంగాణలో ఏ విధంగా పరిస్థితులు ఉండే. మంచినీళ్ల కోసం గోపపడ్డాం. ఇవాళ మిషన్ భగరీథద్వారా పరిశుభ్రమైన నీరు అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.