CM KCR | ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ను తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేథా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘మేథా ఫ్యామిలీ మెంబర్స్కు శుభాకాంక్షలు. రైల్వే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఊహించలేదు. విడివిడి భాగాలను ఎంత స్కిల్తో చేస్తున్నారో కశ్యప్రెడ్డి స్వయంగా చూపించారు. కశ్యప్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మేథా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజంగా గర్వపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే కాదు. గతంలో ఉండే తెలంగాణలో ఒక వెలితి ఉండేది.
తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును, రూ.2500కోట్ల పెట్టుబడితో ఫేజ్-1ను పూర్తి చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తి చేసి ఈ రోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ ఇంకా ముందుకెళ్లారు. హైదరాబాద్లో ఫార్మా, ఫౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగింది. జీనోమ్వ్యాలీలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి దాదాపు మూడింట ఒకటో వంతు ప్రపంచానికి సరఫరా చేస్తున్నాం. ఎక్కడ అభ్యుదయ పథంలో, ప్రగతి పథంలో గుభాళించాలన్న.. బ్రహ్మాండంగా రావాలన్న దానికి సంబంధించి ఎకో బిల్డ్ కావాలి. ఈ ఎకోలో భాగంగానే కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ను తీసుకువచ్చాం.
టీ ఐపాస్ తీసుకువచ్చినప్పుడు నేను శ్రమపడ్డ. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో బిజినెస్ మీటింగ్లో పాల్గొన్న సందర్భంలో చాలా గర్వంగా చెప్పేవాడిని. ప్రపంచంలో భారతదేశంతో పాటు చాలా చోట్ల సింగిల్విండోలున్నాయి. రియల్ సింగిల్ విండో విధానంతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ఫార్స్, బోగస్ ఎంఓయూలు కాకుండా రియల్ స్పిరిట్లో చేస్తున్నాం. ఎంత కఠిన చట్టం తీసుకువచ్చామంటే.. 15రోజుల్లో అనుమతి ఇచ్చి క్లారిటీ ఇవ్వకపోతే ప్రాజెక్ట్ సాంక్షన్డ్ అని చెప్పినం. ఏ ఆఫీసర్ టేబుల్పై ఫైల్ ఆగినా రోజుకు రూ.1000 జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించాం.
ఇలాంటి చర్యలతో పారిశ్రామిక ప్రగతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతున్నది. ఇవాళ నిజంగా ఆనందంగా ఉంది. వరంగల్ ముద్దుబిడ్డలు కశ్యప్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి భారీ ప్రాజెక్టును తీసుకువచ్చి వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టు చేపట్టడమే కాదు.. పూర్తి రైలును తయారు చేసేందుకు ముంబయి నుంచి మోనో రైలు తయారీకి ఆర్డర్ రావడం గొప్ప విషయం. భవిష్యత్లో పూర్తిస్థాయిలో రైలు తయారై పోయేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతున్నారు. దేశంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి స్థాయికి ఎదుగుతున్నామని చెప్పడం అభినందనీయం. 24 గంటలు ఏ సమస్య వచ్చినా పరిష్కారించేందుకు సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం, సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది’ అన్నారు.