హైదరాబాద్: ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.