హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ యనకు ఘనంగా నివాళులు అర్పించారు. కవిగా, సినీగీత రచయితగా పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని కొనియాడారు. గజల్ వంటి ఉర్దూ సాహితీ సంప్రదాయానికి గౌరవమిచ్చి, తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తహజీబ్కు ప్రతీకగా నిలిపారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా, వివిధ యూనివర్సిటీలకు వైస్చాన్సలర్గా ఆయన అందించిన సేవలు అమూల్యమని అన్నారు. కరీంనగర్ బిడ్డగా తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన డాక్టర్ సినారె తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. డాక్టర్ సినారె సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్లో సినారె సారస్వత సదనం నిర్మాణానికి ప్రభు త్వం చర్యలు ప్రారంభించిందని సీఎం పేర్కొన్నారు.