హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): దళిత సాధికారత కోసమే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గురువారం అంబేద్కర్ 131వ జయంతిని పురసరించుకొని సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హకులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు అంబేద్కర్ అని పేరొన్నారు.
అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి అదృష్టమని, ఆయన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా రూ.వేల కోట్లతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూటికి నూరు శాతం సబ్సిడీ కింద అందిస్తున్నామని గుర్తుచేశారు. బడుగు, బలహీనర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపటంలో చదువే శక్తిమంతమైన ఆయుధమని, అందుకే ఆయా వర్గాల విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా సంస్థలు నెలకొల్పామని వివరించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో అర్హులైన వారికి రూ.20 లక్షలు సాలర్షిప్గా అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు.