CM KCR | హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అల్వాల్లోని గద్దర్ నివాసానికి సోమవారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులు ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, చంటి క్రాంతి కిరణ్, మైనంపల్లి హన్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు.
దివంగత గద్దర్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.
గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న… pic.twitter.com/ae41emtgUA
— Telangana CMO (@TelanganaCMO) August 7, 2023