హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ప్రగతి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశర్వర్ రెడ్డి, నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు, పీఆర్వోలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ప్రగతి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. #AmbedkarJayanti pic.twitter.com/zFCfswWrvQ
— Namasthe Telangana (@ntdailyonline) April 14, 2022