హైదరాబాద్ : ప్రపంచంలో రాకెట్ వేగంతో దూసుకొస్తున్న రంగం ఎలక్ట్రికల్ మోటార్స్ రంగం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చైనీస్కు చెందిన ఎంజీ అనే కంపెనీ నుంచి ఈ మధ్యనే నేను ఓ ఎలక్ట్రిక్ కారు కొన్నాను. ఈ సందర్భంగా వారు నాతో ఓ ఫోటో కూడా దిగివెళ్లారు. హైదరాబాద్లో ఎంజీ ఎలక్ట్రిక్ కార్లు వచ్చేసినయ్. స్కూటీలు వేలకొద్ది అమ్ముడుపోతున్నాయి. మూడు, నాలుగు నెలలుస్కూటీలు వెయిటింగ్లో ఉన్నాయి. కొద్ది సంవత్సరాల్లో పెట్రోల్ బంక్లు పోయి, ఛార్జింగ్ బంక్లు వస్తాయి. త్వరలోనే చూడబోతున్నాం. ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ అత్యధికంగా హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో 150 నుంచి 200 కార్లు అమ్మారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.