హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, విప్లు, ఫ్లోర్ లీడర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికపైనా కూడా చర్చించే అవకాశం ఉంది.