పరిగి, ఆగస్టు 16: వికారాబాద్లో రూ. 60.70 కోట్లతో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు 3.22 గంటలకు చేరుకు న్న సీఎం కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాసానికి చేరుకున్న సీఎం కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, ఆ తరువాత కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ను పార్టీ కార్యాలయంలోని ఆయన కుర్చీలో కూర్చుండబెట్టి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 4.15 గంటలకు జిల్లా సమీకృత కలెక్టరేట్ వద్దకు చేరుకున్న సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ప్రత్యేక పూజలుచేశారు.
ఈ సందర్భంగా చాంబర్లోని కుర్చీలో కలెక్టర్ నిఖిల ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వికారాబాద్కు మంజూరైన మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభా వేదికపైకి చేరుకున్న సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, పీవీ వాణీదేవి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, బొగ్గారపు దయానంద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునితారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, కాలె యాదయ్య, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, జడ్పీ వైస్ చైర్మన్ బీ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్లు మంజుల, స్వప్న పరిమళ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి కలెక్టర్ నిఖిలకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చిత్రంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి