హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు జూలూరు తెలిపారు. అనంతరం తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని గౌరీశంకర్ దంపతులు సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.