హైదరాబాద్ : కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. కార్మిక సంఘాలను అణచివేస్తున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆటో కార్మికులకు రూ. రూ. 77 కోట్ల పన్ను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆటో డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద అమలు చేసి వారి కుటుంబాలకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారని మారయ్య అన్నారు.
500 నిరుపేద ఆటోడ్రైవర్లకు ఇళ్లను కేటాయించి ఆదుకున్నారని గుర్తుచేశారు. కార్మికుల సమస్యలు తెలుసుకొని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ఎమ్మెల్సీ కవిత ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త మోటారు చట్టాన్ని తెచ్చి డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయకుండా సీఎం కేసీఆర్ వాహన డ్రైవర్ల జీవితాలను కాపాడారని అన్నారు. ఈటల రాజేందర్ రాజకీయ లబ్ధికోసం కార్మికులను వాడుకోవాలని అనుకోవడం హేయనీయమని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.