మహబూబ్నగర్ : పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ నినాదాలు చేశారు.
మరికాసేపట్లో పాలకొండ వద్ద నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.