తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇకడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పకన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమీ లేకపాయె. తిర్మలగిరి, వర్ధన్నపేట, పాలకుర్తి ప్రాంతాలు తిరిగినప్పుడు అకడ సగం గీకిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావు అని చాలా బాధపడిన. మంచిర్యాల, గోదావరిఖని దగ్గర గోదావరి దాటుతుంటె మొక్కుకున్న. ఏటూరునాగారం వచ్చినప్పుడల్లా చిల్లర పైసలు నదిలో వేసి ‘తల్లీ గోదావరీ.. మా నేలమీదకు ఎప్పుడొస్తవ్. మా కరువు ఎప్పుడు తీరుస్తావ్?’ అని దండం పెట్టుకునేటోడిని. తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తా.. అని కురవి వీరభద్రస్వామికి కడుపునిండా మొకుకున్న. స్వామి దయ, మనం చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్నీ కలిసి రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ వచ్చాక చాలా చాలా మంచి పనులు చేసుకున్నం.
వెనుకబడిన ప్రాంతాల్లో వెలుతురు నింపడం కోసమే పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకున్నం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందువల్లనే మహబూబాబాద్ జిల్లా అయ్యింది. ఇంత మంచి కలెక్టరేట్ వచ్చింది. ములుగు, భూపాలపల్లి జిల్లాలను చేసుకున్నం. అప్పుడు కొందరు వద్దన్నరు. గిరిజన, ఆదివాసీ ప్రాంతాలు, దూర ప్రాంతాలకు బాగుంటుందని నేను చెప్పిన. ఇప్పుడు పాలన దగ్గరికి వచ్చింది. ఫలితం మనకు కండ్లముందు కనబడుతున్నది. మహబూబాబాద్ కూడా జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నం. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. ఈ కలెక్టరేట్ ప్రజా కార్యాలయంగా, ప్రజాసమస్యలు తీర్చే వేదికగా ఉండాలి. రెండుమూడు జిల్లాల్లో మినహా 30 జిల్లాలో ఇలాంటి కార్యాలయాలు కట్టుకుంటున్నం.
పంజాబ్ స్పీకర్ మొన్న వచ్చి మన దగ్గర కలెక్టరేట్ చూసి ఆశ్చర్యపోయిండు. వాళ్ల దగ్గర మంత్రుల చాంబర్ల కంటే మన జిల్లాల కలెక్టర్ ఆఫీసులు బాగున్నయని మెచ్చుకున్నరు. తెలంగాణ మంచి అభివృద్ధి దిశలో ఉన్నది. దీనికి ఒకటే సంకేతం. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో మూడు నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండె. ఇప్పుడు 33 కాలేజీలు అవుతున్నయ్. మహబూబాబాద్లోనూ మెడికల్ కాలేజీ వచ్చింది. తండాలను పంచాయతీలుగా చేయాలని గిరిజనులు 50 ఏండ్లు అడిగిండ్రు. ఉద్యమ సమయంలోనూ నేను చూసిన. ఆదిలాబాద్లోని గోండులు అన్నట్టుగనే.. ఇక్కడ నేను జామతండాలో పల్లెనిద్ర చేసినప్పుడు వాళ్లు ‘మావా నాటె- మావా రాజ్ (మా రాజ్యం మాకు కావాలి)’ అని అడిగిండ్రు. ఊరేగింపులు చేసిండ్రు. దండాలు పెట్టిండ్రు. దరఖాస్తులు పెట్టుకున్నరు. తెలంగాణ వచ్చినంక మనం తండాలను, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలు చేసుకున్నం. మహబూబాబాద్లో 461 గ్రామ పంచాయతీలు ఉండె. తెలంగాణ వచ్చినంక కొత్తగా 283 అయినయి. మన గిరిజన, ఆదివాసీ బిడ్డల చేతుల్లోనే అధికారం ఉన్నది. వాళ్ల తండాలను వాళ్లే బాగా చేసుకుంటున్నరు. నాకు సంతోషంగా ఉన్నది. ఇలాంటి అభివృద్ధి ఇంకా చాలా జరగాల్సి ఉన్నది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.