అగ్ర కథానాయిక పూజాహెగ్డే తెలుగులో పూర్వవైభవం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. ప్రస్తుతం తెలుగులో దుల్కర్సల్మాన్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నదీ భామ. శర్వానంద్ ‘జార్జ్క్రిష్’ చిత్రంలో ఆమెనే కథానాయిక అని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పూజాహెగ్డే టాలీవుడ్లో మరో భారీ ఆఫర్ను దక్కించుకున్నట్లు తెలిసింది. అగ్ర హీరో అల్లు అర్జున్తో ఈ సొగసరి ముచ్చటగా మూడోసారి జోడీకట్టబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అల్లు అర్జున్ సైన్స్ ఫిక్షన్ ‘రాకా’లో నటిస్తున్నారు. అట్లీ దర్శకుడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో బన్నీ సినిమా కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్నగర్ టాక్. గతంలో అల్లు అర్జున్-పూజాహెగ్డే జోడీ ‘డీజే’ ‘అల వైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించారు.