హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో ఒక్క మంత్రి లేకుండానే చర్చ జరుగడం చర్చనీయాంశమైంది. బుధవారం రెండుసార్లు కావడం గమనార్హం. 12.07 గంటలకు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బయటకు వెళ్లిపోయారు.
ఆ సమయంలో అసెంబ్లీలో ఒక్క మంత్రి కూడా లేరు. మళ్లీ 12.50 గంటలకు సభ్యులు మాట్లాడుతుండగా మంత్రి సీతక్క వెళ్లిపోయారు.