హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత జాబితా కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటుంటే, ఆ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్కుమార్ ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ వారి పట్టా భూముల వివరాలను సభలో ప్రవేశపెట్టడం దుర్మార్గమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వారు కొనుగోలు చేసిన భూ లావాదేవీల వివరాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు.