సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జట్లు శుభారంభం చేశాయి. బుధవారం జరిగిన ఓపెన్ సెక్షన్ తొలి రౌండ్ మ్యాచ్లో పురుషుల జట్టు 3-1తో థాయ్లాండ్ను ఓడించింది. వరల్డ్ చాంపియన్ గుకేశ్, నిహాల్ సరిన్, విదిత్ తమ ప్రత్యర్థులను ఓడించారు.
ఇరిగేసి అర్జున్ సులువుగా గెలిచే దశ నుంచి చివర్లో పెద్ద తప్పిదం చేసి ఓడిపోవడంతో భారత్ క్లీన్స్వీప్ చేసే చాన్స్ కోల్పోయింది. మరోవైపు కోనేరు హంపి నేతృత్వంలోని అమ్మాయిల జట్టు 4-0తో డొమినికన్ రిపబ్లిక్ టీమ్ను చిత్తుగా ఓడించింది. లుజాన్ను ఓడించిన హంపి విజయానికి బాట వేయగా.. వైశాలి, వంతిక అగర్వాల్, అరంగేట్ర అమ్మాయి సవితశ్రీ తమ ప్రత్యర్థులను ఓడించారు.