మేడ్చల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అంతాయిపల్లిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.22 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు స్వాగతించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మువ్వన్నెల బెలూన్లను ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించిన తరువాత సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు జరిపారు. జిల్లా కలెక్టర్ హరీశ్ను కలెక్టర్ చాంబర్లోని ఆయన కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ హరీశ్ దంపతులు ముఖ్యమంత్రికి జ్ఞాపికను అందజేశారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చిన సీఎం కేసీఆర్ మార్గమధ్యంలో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎంపీ దీవకొండ దామోదర్రావు, మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సురభి వాణీదేవి, కే నవీన్కుమార్, జనార్దన్రెడ్డి, దయానంద్, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంత్రావు, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్రెడ్డి, అరికెపూడి గాంధీ, ఆశన్నగారి జీవన్రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, అదనపు కలెక్టర్లు ఏ నర్సింహారెడ్డి, జాన్ శ్యామ్సన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కే రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, రైతుబంధు జిల్లా సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.