హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. శామీర్పేట మండలం అంతాయిపల్లి వద్ద నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. 2.55 గంటలకు మేడ్చల్ జిల్లా అంతాయిపల్లికి చేరుకోనున్నారు. 3 గంటలకు సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రజలకు అంకితం చేస్తారు. అనంతరం అంతాయిపల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.