CM KCR | నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీకుమార్, ఎస్పీ మనోహర్తో పాటు పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసు సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయ శిలాఫకలాన్ని సీఎం ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చాంబర్లో ఎస్పీ మనోహర్ను కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్తో పాటు జిల్లా అధికారులు, నేతలు పాల్గొన్నారు.