హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువు ల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్ వేదికగా నిలిచింది. రాఖీపౌర్ణమి సందర్భంగా ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆయన అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టారు.
అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరుడు కేసీఆర్కు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితరులు పాల్గొన్నారు.