హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పౌలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతకుముందు గన్పార్క్లో అమరవీరులకు నివాళులర్పించారు.