హైదరాబాద్: పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు.
రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్ ఆవరణలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేకానంద, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.