హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు పలువురు నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రగతి భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. అక్కడ అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. స్వతంత్ర భారత స్వర్ణోత్సవ వేళ.. భారత స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.
‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.#స్వాతంత్ర్యదినోత్సవం #IndiaAt75 pic.twitter.com/Y36ngliZcg
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2022