హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కేసీఆర్కు యాంజియోగ్రామ్ పరీక్షలు పూర్తయినట్లు యశోద వైద్యులు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు. యాంజియోగ్రామ్ టెస్ట్ నార్మల్గా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎలాంటి బ్లాక్స్ లేవని తెలిపారు. మరికాసేపట్లో సిటీ స్కాన్తో పాటు రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్కు బయల్దేరే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుంచి వీక్గా ఉన్నారు. ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. దీంతో యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.
కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మనుమడు హిమాన్షు, కూతురు కవిత, అల్లుడు అనిల్, మంత్రి హరీశ్రావు, ఎంపీ సంతోష్ కుమార్తో పాటు పలువురు ఉన్నారు.