Dubbak | ఉద్యమాల గడ్డ దుబ్బాక. ఒక జర్నలిస్టును శాసనసభకు పంపిన నేల. ఇక్కడి ప్రజలు ఆది నుంచీ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2008 ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లోనూ వరుస విజయాలను అందించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. సిద్దిపేట, గజ్వేల్తో సమానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం ఉన్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఉద్యమంలా కొనసాగుతున్నాయి. తొగుట మండలంలో ‘మల్లన్న సాగర్’ ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కూడవెల్లి వాగు జీవనదిగా మారింది. మిషన్ కాకతీయ ద్వారా రూ.14,381 కోట్లతో 718 చెరువులు, కుంటలను పునరుద్ధరించడంతో భూగర్భ జలాలు పెరిగాయి. 36 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. 93,471 మంది రైతులకు రూ.70.80 కోట్లు రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. చనిపోయిన 60 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా ద్వారా రూ. 3 కోట్ల పరిహారాన్ని అందజేసింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేస్తున్నది. చెరువులు, కుంటలల్లో సబ్సిడీ చేప పిల్లలను వేసి, మత్స్యకారులకు ఉపాధిని కల్పిస్తున్నది. గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెలు పంపిణీ చేసింది. తొలివిడత 100 మంది దళితులకు వివిధ రంగాల యూనిట్లను అందజేసింది.
ప్రజలకు మెరుగైన వైద్యం
దుబ్బాకలో రూ.20 కోట్లతో వంద పడకల అధునాతన దవాఖానను నిర్మించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ.10 కోట్లతో సీఎం కేసీఆర్ బడి భవనం, రూ.4.5 కోట్లతో నూతన బస్టాండు, మున్సిపాలిటీలో సుమారు రూ. 150 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డంప్యార్డులు, వైకుంఠధామాలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రూ.20 కోట్లతో వంతెనలు, రూ. 10 కోట్లతో చెక్డ్యాంలు, బాలాజీ దేవాలయ నిర్మాణానికి రూ. 5 కోట్లు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పల్లెప్రకృతి వనాలు, రహదారులు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. రామసముద్రం, పెద్ద చెరువు కట్టలను సుందరీకరించారు. వంద కోట్లతో రహదారులు నిర్మించారు. 141 పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించింది.
…?అవదూత బాలరాజు