సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన అడవులు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. అడవుల అభివృద్ధి, పచ్చదనం పెంపు కోసం కేసీఆర్ బృహత్తర హరితహారం పథకాన్ని చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో భూపాలపల్లి జిల్లాలో హరితహారం కింద రూ.12 కోట్లు వెచ్చించారు.
7966.18 ఎకరాల్లో మొక్కలు నాటి పెంచడంతో దట్టమైన అడవులుగా వృద్ధి చెంది పచ్చదనం పెంపొందింది. అడవుల్లో నీటి వనరులను నెలకొల్పింది. అడవులు అభివృద్ధి చెందడంతో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మూడు దశాబ్దాల తర్వాత భూపాలపల్లి అడవుల్లోకి పెద్ద పులులు పునరాగమనం చేశాయి.
– జయశంకర్ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ