హైదరాబాద్ : బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు. సెప్టెంబర్ 3న మధ్యాహ్నం హైదరాబాద్కు సీఎం కేసీఆర్ తిరిగి బయల్దేరనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.