మహబూబ్నగర్ : డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరాయని..బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత సరైన న్యాయం జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏండ్లలో తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో..తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఏడేండ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో నిజాయితీగా చూస్తే తెలుస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
భారత్, రష్యా మధ్య పలు రక్షణరంగ ఒప్పందాలు
చరిత్రలో ఈరోజు : బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి 29 ఏండ్లు