CM KCR | నిజామాబాద్ : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి గురించి అడ్డగోలుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉండాలే అని శివకుమార్పై కేసీఆర్ మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ కూడా ఉండాలే.. ఓ పెద్ద లీడర్ అని కర్ణాటక నుంచి ఎగేసుకుని వచ్చిండు. అక్కడ ఉప ముఖ్యమంత్రి అంట. నాకు డైలాగ్ కొడుతుండు. ఏం డైలాగ్ అంటే.. కర్ణాటక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది.. బస్సు పెడుతా రా.. ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తుండు. మేం 24 గంటలు ఇస్తున్నాం రా బాబు.. నీకు ఎవడన్నా చెప్పిండో లేదో.. నువ్వొచ్చి మాకు నీతులు చెప్తే మేం ఏం చేయాలి అని కేసీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
ఇక ఈ బీజేపోళ్లు ఊపుకుంటూ వస్తరు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకడు వస్తడు. నోటికొచ్చినట్టు మాట్లాడిపోతరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిలు వచ్చి ఇట్లనే మాట్లాడిపోతరు. ఉత్తరప్రదేశ్ కూలీలు మన వద్దకు వచ్చి నాట్లు వేసి పోతున్నరు. వాడొచ్చి మనకు ఉపన్యాసం చెబితే ఇప్పుడే నేనేం చేయాలి.. రౌతు పట్టుకుని నెత్తి పగులగొట్టుకోవాల్నా..? ఇగో ఇట్ల ఉన్నది కథ. మీ ప్రజలు బతకలేక మా దగ్గర వచ్చి బతుకుతున్నరు. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నరు. మీరొచ్చి మాకు నీతులు చెప్తే ఎట్ల ఉంటది ఆలోచించాలి. వీళ్లు కనుక వస్తే రైతుబంధుకు రాంరాం.. కరెంట్ కాటగలుస్తది.. దళితబంధుకు జైం భీం.. ఈ కథ తయారైతది. నేను కూడా ఏం చేయలేను. మీ కోసం మస్తు కొట్లాడాను. 14 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడాను. ఇప్పుడు పందేండ్లు కొట్లాడాను. ఇప్పుడు మీరు కొట్లాడి నిర్ణయం చేయాలి అని కేసీఆర్ ప్రజలకు సూచించారు.