CM KCR | పెద్దపల్లి : అధికార పార్టీకి చెందిన నాయకులను సంతలో పశువులను కొన్నట్టు మాదిరిగా కొంటారా..? అని కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 58 ఏండ్లు మన గోస పోసుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంథని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పుట్ట మధు మాటలు విన్న తర్వాత కొన్ని మాటలు చెప్పాలని ఉంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తుంది. మన దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండాల్సిన రాజకీయ పరిణితి లేదు. చాలా తక్కువ ఉంది. రాజకీయ పరిణితి లేకపోవడంతో ఎన్నికలు రాగానే ఆగమాగం లక్షల కోట్లు పెట్టి సంతలో పశువుల్లా మాదిరి నాయకులను కొనడం జరుగుతోంది. ఇది సరికాదు. అబద్దాలు, పనికిమాలిన ఆరోపణలు జరుగుతాయి. ఇవన్నీ అధిగమించాలంటే రాజకీయ పరిణితి పెరగాలి. అలా రాజకీయ పరిణితి పెరిగిన దేశాల్లో పేదరికం, దరిద్రం పోతున్నాయి. మ నదేశంలో కూడా రావాలి. ప్రజలు గెలిచేటటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి. ప్రజస్వామ్య దేశంలో వజ్రాయుధం ఓటు. ఆ ఓటు మీ తలరాతను మారుస్తది. ఆషామాషీగా నాలుగు పైసలకు ఆశపడి ఓటు వేయొద్దు. మన తలరాతను లిఖించే ఓటును జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. అందుకే నేను కోరేది ఏంటంటే.. ఆగమాగమై ఓట్లు వేయొద్దు. మీరు ఊరికి పోయిన తర్వాత మీ ఊర్లలో చర్చ చేయాలి. కేసీఆర్ మాటలపై పది మందిని పోగేసి చర్చ చేయాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ ప్రజలు, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. 15 ఏండ్లు ఉద్యమం చేశాం. 10 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశామో మీ కండ్ల ముందుంది. కాంగ్రెస్ ఏకబిగిన 50 ఏండ్లు పరిపాలించింది. ఆంధ్రాలో తెలంగాణను కలిపింది కాంగ్రెస్ పార్టీ. సమైక్య రాష్ట్రంలో మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంట్ లేదు. ఉద్యమాలు, తుపాకీ మోతలు, ఎన్కౌంటర్లు, అమాయకులు చనిపోవడం, పోలీసులు చనిపోవడం రక్తపాతంలా ఒక విచిత్రమైన పరిస్థితి. ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చిందో ఆలోచించాలి. ఇవాళ తియ్యగా మాట్లాడితే సరిపోదు. ఇదంతా మీ చరిత్ర కాదా..? 58 ఏండ్లు మా గోస పోసుకున్నది మీరు కాదా..? మొన్నటికి మొన్న కూడా ఇబ్బంది పెట్టారు. తెలంగాణ ఉద్యమ ఉప్పెనను చూసి రాజకీయ లబ్ది కోసం 2004లో తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ రాష్ట్రాన్ని వెంబడే ఇవ్వలేదు. 15 ఏండ్లు మోసం చేశారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం పట్టించే పని చేశారు. మళ్లీ ఉద్యమాన్ని నాశనం చేసే పరిస్థితి చేశారు. మనం మొండిగా ఉండి.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో తేలాలని వదిలేది లేదని మొండిగా పోయినం. చావు అంచులకు పోయి ఆమరణ దీఅక్ష చేస్తే తెలంగాణ ప్రకనట చేశారు. మళ్లా వెనక్కి వెళ్లారు. మళ్లా చాలా మంది పిల్లలు చనిపోతే, మనం కొట్లాడితే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు.