హైదరాబాద్ : బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని బండి సంజయ్ను కేసీఆర్ హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో పరిపాలన చేస్తున్నాం. మీలాగా దొంగ లెక్కలు చేయలేదు. కర్ణాటకలో మీరు ప్రజాతీర్పును శిరసా వహించలేదు. గవర్నమెంట్ను కూలగొట్టి దొడ్డిదారినా బీజేపీ గవర్నమెంట్ నడుస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా మీ పరిస్థితి అంతే. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలదోసిండ్రు. దీనిపై మీ సమాధానం ఏంటి? ఇది అప్రజాస్వామ్యం కాదా? దీనిపై మాట్లాడితే తప్పా? తెలంగాణలో 107 స్తానాల్లో బీజేపీ డిపాజిట్లు పోయాయి. నాగార్జున సాగర్లో కూడా డిపాజిట్ పోయింది కదా?
చాలా భయంకరంగా మీకు లొంగి ఉండి, మీరు చెప్పింది వింటే వారు మంచోళ్లు. దేశభక్తులు. మీరు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపితే దేశ ద్రోహులు అయిపోతారు. ఆ తర్వాత ఐటీ దాడులు చేయిస్తారు. అన్యాయంగా కేసులు పెడుతారు. ఇక్కడ పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరు. బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. మా హద్దులు మాకు తెలుసు. నేను హద్దు మీరి మాట్లాడలేదు. వడ్లు కొంటారా? లేదా ? అంటే హద్దు మీరి మాట్లాడినట్టా? ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. స్థానిక సంస్థల నుంచి శాసనసభ ఎన్నికల వరకు టీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ పార్టీకి తెలంగాణలో అడ్రస్ లేదు. జీహెచ్ఎంసీలో మా కంటే చాలా తక్కువ గెలిచి కూడా పెద్ద ఫోజు కొట్టిండు. అడ్డగోలుగా మాట్లాడి, తప్పుడు మాటలు చెప్పి నాలుగైదు సీట్లు గెలిచారు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ తిరుగు లేకుండా విజయం సాధించింది అని కేసీఆర్ పేర్కొన్నారు.