హైదరాబాద్ : వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సీటీలు సహా 200కు పైగా ఇనిస్టిట్యూషన్స్లో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు.
ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. గతంలో మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని, ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు అమలు చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బీసీ విధ్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం అదనంగా ఏటా 150కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్పులతో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియంబర్మెంట్ చెల్లిస్తున్నామని, ఇక నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లోని బీసీ బిడ్డలకు సైతం పూర్తి ఫీజు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా బీసీ అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసారు.