Achampet | అచ్చంపేట అంటే నల్లమల అటవీ ప్రాంతం.. విసిరేసినట్టుగా ఉండే గ్రామాలు.. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకవు.. బోర్లు వేసినా నీళ్లు పడవు.. ఏదైనా ఆపదొస్తే వైద్యానికి దేవుడే దిక్కు.. అలాంటి అచ్చంపేట నియోజకవర్గంలో కేసీఆర్ పాలనలో పెనుమార్పులు వచ్చాయి. అనేక ప్రాంతాలకు సాగునీళ్లు వచ్చాయి. పోడు పట్టాలు, డబుల్ ఇండ్లు అందాయి. 100 పడకల దవాఖాన వచ్చింది. పరిపాలన చేరువైంది.
నాగర్కర్నూల్, అక్టోబర్ 25 (నమస్తే తె లంగాణ): స్వరాష్ట్రంలో అచ్చంపేట అభివృద్ధికి మెట్టులా తయారవుతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రేమ, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కృషితో ప్రగతి పరుగులు పెడుతున్నది. గుక్కెడు నీళ్లు దొరకని, బోర్లు వేసినా పడని దుస్థితిని మిషన్ భగీరథ పూర్తిగా మార్చివేసింది. ఇంటింటికీ నల్లాలతో నీటిని అందిస్తూ తాగునీటి సమస్య శాశ్వతంగా తీర్చింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఉప్పునుంతల, అచ్చంపేట, బల్మూర్లోని కొన్ని ప్రాంతాలకు సా గునీళ్లు వస్తున్నాయి.
ప్రభుత్వం 2,500 కోట్లు మం జూరు చేయడంతో అచ్చంపేట లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశారు. లిఫ్టు పూర్తయితే నియోజకవర్గంలోని మద్దిమడుగు, పదర, అమ్రాబాద్ వంటి ప్రాంతాల ఆయకట్టు (72 వేల ఎకరాలు)కు సాగునీరు అందుతుంది. 150 మందికి డబుల్ ఇండ్లు మంజూరవడం తో పేదల్లో సంతోషం నెలకొన్నది. 100 పడకల దవాఖాన ప్రారంభమైంది. పోడుభూములకు పట్టాల పం పిణీతో చెంచులు, గిరిజనులు అటవీ భూములకు ఓనర్లు అయ్యారు. ఈగలపెంట, మన్ననూరులో ఎకో టూరిజంలో భాగంగా నిర్మించిన కాటేజీలు పర్యాటకానికి కొత్త అందాన్ని తెచ్చాయి. గతంలో జిల్లా కేం ద్రానికి వెళ్లాలంటే ఒకట్రెండు రోజులు పట్టేది. ఇప్పు డు నాగర్కర్నూల్కు వెళ్లి ఒక్క రోజులోనే పని చేసుకొంటున్నారు. నల్లమలలోని మద్దిమడుగు, సలేశ్వ రం, ఉమామహేశ్వరం, రం గాపూర్లాంటి ప్రాంతా లు ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అచ్చంపేటలో 4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం ఆలయాలను అభివృద్ధి చేశారు. అచ్చంటపేలో ఇండోర్, ఎన్టీఆర్ స్టేడియాల్లో రూ.3.50 కోట్లతో వసతులు కల్పించారు.డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేశారు. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. గిరిజన పంచాయతీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఆర్డీవో, పోలీస్ సబ్ డివిజన్ కొత్త కార్యాలయాల ఏర్పాటుచేశారు. అచ్చంపేట, ఉప్పునుంతలలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.107 కోట్లతో 15 కిలోమీటర్ల బ్రాంచ్కెనాల్ నిర్మాణానికి రూ.107 కోట్లు విడుదల చేశారు.